ANDHRABREAKING NEWSCRIMESTATE

లంబాడి హక్కుల సాధన కోసమే సమితి ఏర్పాటు

లంబాడి హక్కుల సాధన కోసమే సమితి ఏర్పాటు

-: లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాస్ నాయక్

కర్నూలు, (SK1 NEWS HD) :

లంబాడి హక్కుల సాధన కోస మే సమితి ఏర్పాటు చేసు కు న్నట్లు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాస్ నాయక్ తెలిపారు.
బుదవారం కర్నూల్ కలెక్టర్ ఆఫిస్ అవరన లోని డిపి ఆర్ ఓ మిడియ పాయింట్లో లంబాడి హక్కుల పోరాట సమితి! (యల్.యచ్.పియస్)  కరపత్రం విడుదల చేయడం జరిగింది .యల్.యచ్.పి.యస్.కరపత్రం విడుదల సందర్భంగా వివిధ ప్రజాసంఘాల సినియర్ నాయకుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాస్ నాయక్ మాట్లాడుతూ అంబేడ్కర్  గిరిజన ప్రజల అభివృద్ధికై రాజ్యాంగంలో  కల్పించిన హక్కుల సాధనకై ఏర్పాటు చేసుకున్న ఎకైక పోరాట సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి అని   తెలియజేశారు.  ఈ సంఘం ఏర్పాటు మొదటి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ దిల్ సూఖ్ నగర్ ప్రభూత్వ గిరిజన వసతి గృహంలో 1997 జులై 1న ఆవిర్భావం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతా ల లంబాడీ సుగాలి చదువు కున్న యువకులతో ఏర్పాటు చేసుకున్న సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ అనినాటి నుండి నేటి వరకు అలుపెరుగ కుండా పార్టీలకు ప్రాంతాలకు అతీతం గా కేవలం జాతి ప్రయోజనాలకై పోరాటం చేస్తున్న   సంఘం పోరాట లక్ష్యం 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను చెంచు పెంటలను ప్రత్యేక గ్రామ పంచా యతీలుగా ప్రభుత్వాల ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ సాధన కై చైతన్య సభలు బహిరంగ సభలు, పాద యాత్రలు, సైకిల్ యాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న తండాలను తిరిగి గిరిజన లంబాడీల ప్రజలను చైతన్య పరుస్తూ డిమాండ్  సాధించుకున్న సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి అని గుర్తు చేశారు.ఈ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో 3175 ప్రత్యేక గ్రామ పంచాయతీలను సాధించుకుని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభాను బట్టి దాదాపుగా 200 పై చిలుకు తండాలను గ్రామ పంచాయతీ లు  ప్రభుత్వాలను మెప్పించి చేసుకోవడం జరిగింది.మరి కొన్ని పంచాయతీలను చేయిం చు కోవాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు.  పంచా యతీలు జరగడంతో దాదాపు గా గిరిజన లంబాడీలు నాలుగువేల దాకా సర్పంచులు చేసుకోగలిగామన్నారు. 30 వేల దాకా వార్డు మెంబర్ లను చేసుకో గలిగితే రాజకీయ చైతన్యంతో ఎంపీటీసీ జడ్పిటిసి అయితే నేమి ఇలా రాజకీయ పదవులను సాధించగలిగాం ఉన్నారు. పోరాటాలతో ఎక్కడ కూడా మన జాతికి అన్యాయం జరగకుండా మాకు రావలసిన హక్కులు ఏవైతే ఉన్నాయి. దాని ద్వారా వచ్చే ఫలాలను కూడా లంబాడి హక్కుల పోరా ట సమితి ద్వారానే సాధించు కుంటున్నాం.ఈ  సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంస్థను ఏర్పాటు జరిగి జూలై ఒకటో తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 వ సంవత్స రంలో అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయస్థాయిలో లంబాడి హ క్కుల పోరాట సమితి సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంఘ పెద్దలు నిర్ణయం తీసు కోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే జూలై 1న తెలంగాణలోని ఖమ్మం జిల్లా మహబూబాబాద్ (మాను కోట)నందు ఆవిర్భావ సభ సిల్వర్ జూబ్లీ 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం గా జాతీయ స్థాయిలో గోర్ బంజారా లంబాడి సుగాలి నాయకులను సభకు పిలవడం జరుగు తుందని  ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల అన్నిటిలో దాదాపుగా మా లంబాడి సుగాలి లు అనబడే ప్రజలు కూడా హాజరు పెద్ద ఎత్తున కావాలని పిలుపునిస్తూ కర పత్రాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు.మరికొన్ని డిమాండ్లతో సంఘo ముందు కెళ్తుందని డిమాండ్ లో భాగంగా భారతదేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరుతో పిలువబడే బంజారా జాతి. గోర్ బంజారా జాతిఅని  మా భాష లో మేము పిలుచుకునే జాతి తెగ పేరు (గోర్) బంజారా అనబడే మేము దాదాపుగా 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో 12 కోట్ల పైబడి ఉన్న ఈ జనాభా ఇప్పటికీ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బంజారా జాతి వారు మాట్లాడే  బంజారా భాష రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ తొ రాబోయే కాలంలో జాతిని ఐక్యమత్యం చేస్తూ  ప్రాంతాలకు రాష్ట్రాలకుఅతీతంగా ఒక డిమాండుతో ముందుకు తీసుకెళ్తామని ఈ డిమాండ్ల సాధన కు ప్రతి ఒక్క సుగాలి బిడ్డలు సహకరించాలని కోరుతున్నా మన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.
బిసిసంగం సినియర్ నాయకులు.నక్కలమిట్ట శ్రినివాసులు.శేషఫణి.పట్నాంరాజేశ్వరి. ముస్లిం మైనారిటీ నాయకులు ఇనాయుతుల్లా .ఖాదిర్ భాషా. యంజే బాబురాజు .వాడాలత్యాగరాజు .అన్వర్ హుసేన్ మరియు   షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఉద్యోగసంఘం నాయకులు.అర్జున్ నాయక్ కాళేనాయక్ దుర్గా వరప్రసాద్ నేణవత్ రాము నాయక్ బాలునాయక్ శంకర్ నాయక్ యం అర్ పి యస్ ధరూర్ గోపి  గిరిజన విద్యార్థి చంద్రప్పా తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button
error: Content is protected !!