ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

రాజీ మార్గమే రాజమార్గము

జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్

రాజీ మార్గమే రాజమార్గము

పంతాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు

కేసుల్లో రాజీ అయి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలి

డోన్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్

వెల్దుర్తి , అక్టోబర్ 15, (SK1 NEWS HD):

రాజీ మార్గమే రాజమార్గమని కేసుల్లో రాజీ అయి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని డోన్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్ అన్నారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న మెగా లోక్ అదాలత్ సత్వర న్యాయ మేళా అవగాహన కార్యక్రమంలో శనివారం జడ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డోన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జడ్జి మాట్లాడుతూ కేసుల్లో రాజీ అయి
కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. పంతాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కేసుల్లో రాజీ అయితే కలిగే ప్రయోజనాలను, కాకపోతే కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సిఐ యుగంధర్, ఎస్సై రాంమోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నరసింహులు, గోపాల్ రెడ్డి, జూనియర్ న్యాయవాది షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!