ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATEWORLD

ప్రపంచ సేపక్ తక్రా పోటీలకు శివకుమార్ ఎంపిక

ప్రపంచ సేపక్ తక్రా పోటీలకు శివకుమార్ ఎంపిక

కర్నూలు స్పోర్ట్స్, జూన్ 25, (SK1 NEWS HD) :

ప్రపంచ సేపక్ తక్రా జీన్స్ కప్ పోటీలకు మన రాష్ట్రానికి,జిల్లాకు చెందిన శివకుమార్ భారత జట్టు తరపున పాల్గొంటారని రాష్ట్ర సంఘం జీ.శ్రీనివాసలు తెలిపారు.ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కలవడం జరిగింది. జిల్లా ను ఎంపికైన శివకుమార్ ను కలెక్టర్ కోటేశ్వరరావు తన ఛాంబర్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి భారత జట్టుకు శివ కుమార్ ఎంపిక కావడం అభినందనీయమన్నారు ప్రభుత్వ తరఫున సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సపక్ తాక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ శివకుమార్ జులై 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యాంకాక్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు భారత జట్టుకు ఎంపిక కావడం జరిగిందని శివ కుమార్ అనేక జాతీయ స్థాయి పోటీలలో అద్భుతం కనపరిచిన కారణంగా భారత జట్టులో స్థానం సంపాదించడం రాష్ట్రానికి గర్వకారణం. అలాగే భారత జట్టుకు థాయిలాండ్ శిక్షకుల ద్వారా 20 రోజులపాటు బ్యాంకాక్ లో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారనీ. ఆయన తెలిపారు. అనంతరం ప్రపంచం సేపక్ తక్రా చాంపియన్ షిప్ లో పాల్గొంటారనీ తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, రాష్ట్ర స్కేటింగ్ సంయుక్త కార్యదర్శి సునీల్, కుమార్ సీనియర్ క్రీడాకారుడు నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!